రేణిగుంటలో బీజేపీ నేతపై వైసీపీ శ్రేణుల దాడి

Update: 2020-03-12 13:00 GMT
ysrcp leaders attack on bjp leader

చిత్తూరు జిల్లా రేణిగుంటలో బీజేపీ నేతపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు తిరస్కరించడంపై అధికారులను అడిగేందుకు వెళ్లిన బీజేపీ నాయకుడు సుబ్రమణ్యంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. పోలీసులు అడ్డు చెబుతున్నా వినిపించుకోకుండా సుబ్రమణ్యంపై చేయి చేసుకున్నారు.

పోలీసులు జోక్యం చేసుకుని బీజేపీ నాయకుడిని ఎంపీడీవో కార్యాలయంలోకి పంపించారు. అధికారులు వైసీపీకి కొమ్ము కాస్తూ తన నామినేషన్లు తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్ల తిరస్కరణపై నాయపోరాటం చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News