YS Vahana Mitra: వైఎస్‌ వాహనమిత్ర పథకం నిధులు విడుదల

YS Vahanamitra: 2లక్షల 48వేల మంది డ్రైవర్లకు లబ్ధి * ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.10వేల చొప్పున సాయం

Update: 2021-06-15 07:44 GMT

వైస్ వాహన మిత్ర పథకం (ఫైల్ ఇమేజ్)

YS Vahana Mitra: గత ప్రభుత్వంలో భారీగా చలాన్లు వసూళ్లు చేశారని సీఎం జగన్‌ ఆరోపించారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లను టీడీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందన్నారు. వైఎస్‌ వాహనమిత్ర పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ పథకం ద్వారా 2లక్షల 48వేలకు పైగా మందికి 10వేల చొప్పున సాయం చేశారు. 2018 మే 14న ఏలూరు సభలో ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చానని సీఎం జగన్ అన్నారు. గత మూడేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి 30చొప్పున ఆర్థికసాయం అందిందని అన్నారు.

Tags:    

Similar News