YS Sharmila: ప్రత్యేక విమానంలో కడప బయల్దేరిన వైఎస్ షర్మిల

YS Sharmila: రేపు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్న షర్మిల

Update: 2024-01-20 10:51 GMT

YS Sharmila: ప్రత్యేక విమానంలో కడప బయల్దేరిన వైఎస్ షర్మిల

YS Sharmila: APCC చీఫ్ వైఎస్‌ షర్మిలా శంషాబాద్ విమానాశ్రయంలో.. ప్రత్యేక విమానంలో కడప బయల్దేరి వెళ్లారు. కడప నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇడుపులపాయ YSR ఘాట్ వద్దకు చేరుకోనున్నారు. షర్మిల వెంట కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి ఉన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యలు చేపట్టిన అనంతరం పార్టీ బలోపేతంపై షర్మిల దృష్టి సారించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వవైభవాన్ని తీసుకురావడంలో భాగంగా.. పార్టీ పట్ల అభిమానం కలిగిన కుటుంబాలను వెనక్కిరప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News