YS Sharmila: ఏపీకి ప్రత్యేక హోదాను తేవడంలో చంద్రబాబు, జగన్ విఫలం
YS Sharmila: జగన్ మూడు రాజధానులని గందరగోళం చేశారు
YS Sharmila: ఏపీ ప్రజలకు ప్రధాని మోడీ అన్యాయం చేశారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ హామీ ఇచ్చారని..పదేళ్లు కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు అడిగారని గుర్తు చేశారు. ఏపీ ప్రత్యేక హోదాను తేవడంలో చంద్రబాబు, జగన్ విఫలమయ్యారన్నారు షర్మిల. జగన్ మూడు రాజధానులని గందరగోళంచేశారని షర్మిల ఆరోపించారు.