రేపు సాయంత్రం సీఎం జగన్ విజయవాడ దుర్గమ్మను దర్శంచుకోనున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అక్టోబర్ 5న జగన్ ఢిల్లీ పర్యటన ఉన్న కారణంగా షెడ్యూల్ లో మార్పులు చేశారు. దీంతో ముందు రోజే సీఎం జగన్, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం రాక సందర్భంగా అధికారులు ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు చేస్తున్నారు.