మోడీ తిరుపతి పర్యటన సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధానితో భేటీ కానున్నారు. ప్రత్యేక హోదాపై మోడీకి వినతి పత్రం అందించనున్నారు. విభజన చట్టంలోని సెక్షన్ 50, 51ని సవరించాలని కోరనున్నారు జగన్. రాష్ట్రానికి గతంలో మూడేళ్లు మాత్రమే నిధులు సక్రమంగా ఇచ్చారని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు 74వేల 169 కోట్లు అవసరం ఉందని, ఆమేరకు నిధులు ఇవ్వాల్సిందిగా సీఎం జగన్ పీఎం నరేంద్ర మోడీని కోరనున్నట్టు సమాచారం.