రాజధానిపై జగన్ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-02-05 07:28 GMT

అమరావతి నిర్మాణానికి లక్షా తొమ్మిది కోట్ల నిధులు అవసరం ఉందన్నారు ఏపీ సీఎం జగన్. విజయవాడలో ఎక్స్ లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ అమరావతిపై స్పందించారు. అభివృద్ధి ఒకే చోట కేంద్రీ కృతం కాకుందడన్నారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగుతుందని చెప్పారు. విశాఖలో మౌళిక వసతులన్నీ ఉన్నాయని చెప్పారు. పదేళ్లలో విశాఖను అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఏ నిర్ణయం తీసుకున్న రాష్ట్రాభివృద్ధి కోసమే అని సీఎం జగన్ చెప్పారు.


Tags:    

Similar News