దారుణం : వైఎస్ జగన్‌ను మున్సిపల్ కమిషనర్‌గా మార్చేశారు.

Update: 2019-10-02 10:17 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను మున్సిపల్ కమిషనర్‌గా మార్చేశారు. పార్వతీపురంలో వార్డు సచివాలయం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మున్సిపల్ కమిషనర్‌ ప్లేస్ లో ముఖ్యమంత్రి జగన్ ఫోటోను పెట్టారు. అంతటితో ఆగకుండా స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావును ప్రత్యేక అధికారిగా అంటూ ఆ ప్లేక్సిలో పేర్కొన్నారు. దీనిని ఏకంగా వార్డు సచివాలయం ముందే ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీని చూసిన స్థానికులు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని గుర్తించిన అధికారులు వెంటనే తొలిగించారు. ఇలాంటి చిన్న చిన్న తప్పుల వలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు.  

Tags:    

Similar News