వైసీపీ అధినేత వైయస్ జగన్ నేడు(శుక్రవారం) పులివెందులలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకుముందు పులివెందులకు ఉ.10గంటలకు ఆయన హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు.
స్థానిక సీఎస్ఐ చర్చి మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పులివెందుల ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. నామినేషన్ పూర్తయ్యాక హైదరాబాద్కు బయల్దేరి వెళ్తారు.