శాంతిభద్రతల నేపథ్యంలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మను విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టనీయలేదు పోలీసులు. దీంతో ఆయన ఏపీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను తిరిగి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచే హైదరాబాద్ కు పంపించారు. దీనిపై స్పందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్మను అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. రామ్గోపాల్ వర్మ ప్రెస్ మీట్కు పోలీసులు అనుమతి నిరాకరించడానికి ఆయన చేసిన తప్పేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిచారు. ఇలాంటి సంఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిపోతాయి, ఇలాంటి వైఖరి గర్హనీయమని ట్విటర్లో ట్వీట్ చేశారు.