Yoga Day: జూన్ 21న విశాఖ తీరంలో ఘనంగా యోగా డే..5లక్షల మందితో గిన్నీస్ రికార్డ్

Yogandhra 2025: జూన్ 21, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ తీరంలో ఘనంగా యోగా డే జరగనుంది. ఏకంగా 28 కిమీలలో దాదాపు 5 లక్షల మందికి పైనే యోగా డే ఉత్సవాల్లో పాల్గొని గిన్నిస్ రికార్డు సాధించనున్నారు.

Update: 2025-06-20 13:37 GMT

Yoga Day: జూన్ 21న విశాఖ తీరంలో ఘనంగా యోగా డే..5లక్షల మందితో గిన్నీస్ రికార్డ్

Yogandhra 2025: జూన్ 21, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ తీరంలో ఘనంగా యోగా డే జరగనుంది. ఏకంగా 28 కిమీలలో దాదాపు 5 లక్షల మందికి పైనే యోగా డే ఉత్సవాల్లో పాల్గొని గిన్నిస్ రికార్డు సాధించనున్నారు.

విశాఖపట్నం అందమైన సముద్ర తీరం. ఎగిరే అలల శబ్బాలు, చల్లని గాలులతో బీచ్ వాతావరణం అక్కడ ఎప్పుడూ అహ్లాదకరంగా ఉంటుంది. ఇక జూన్ 21 యోగా డే సందర్భంగా దాదాపు 5 లక్షలమంది యోగా చేసి, రికార్డు సృష్టించబోతున్నారు.

ప్రజలకు యోగా, యోగాతో బెనిఫిట్స్ పై అవగాహన కల్పించడానికే యోగా డేను ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. విశాఖలోని ఆర్ కె బీచ్ నుండి భీముని పట్నం వరకు అంటే దాదాపు 28 కిమీ రోడ్డుపై యోగాను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో యువత, పెద్దలు, పిల్లలు , యోగా గురువులు అందరూ పాల్గొననున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆంద్ర ప్రదశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాడు నాయుడు ఈ కార్యక్రమానికి అతిధులుగా హాజరవుతున్నారు.

Tags:    

Similar News