అన్యమత ప్రచారం పేరుతో ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు హయాంలో హిందూ మతానికి తీరని అన్యాయం చేశారని చెప్పారు. అన్యమత ప్రచారం కాదు బాబు ముఠా ప్రచారం అని అన్నారు. సీఎం జగన్ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించాలని చూస్తున్నారని తెలిపారు. బిజెపీ, టీడీపీ జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.