ఈ భేటీ వెనుక చంద్రబాబు ఉన్నాడు : ఎమ్మెల్యే అంబటి

Update: 2020-06-23 12:13 GMT

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్‌, సుజనా చౌదరి రహస్యంగా భేటీ కావడంపై వై‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిమ్మగడ్డ దుర్మార్గపు మనస్తత్వం ఈ భేటీతో బయటపడిందన్నారు. ఎమ్మెల్యే అంబటి వ్యాఖ్యలు యధాతథంగా.. నిమ్మగడ్డ వెనుక చంద్రబాబు ఉన్నాడని ముందు నుంచి చెప్తున్నాం. టీడీపీ, నిమ్మగడ్డ కలిసి ప్రభుత్వం పై చేసిన కుట్ర బయటపడింది. రాజ్యాంగ పదవిలో ఉన్నానని చెప్పుకుంటూ హోటల్ లో రహస్య భేటీలు ఏంటి. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు చంద్రబాబు మనుషులే వాళ్లతో రహస్య భేటీ అంటే ఏమనుకోవాలి.

ఈ భేటీ వెనుక చంద్రబాబు ఉన్నాడు. ఆయన డైరెక్షన్‌ లోనే భేటీ జరిగింది. గంటపాటు చర్చలు జరిపి ఏం కుట్రకు పన్నాగం పన్నారో చెప్పాలి. నిమ్మగడ్డ దుర్మార్గపు మనస్తత్వం ఈ భేటీతో బయటపడింది. నిమ్మగడ్డ దొరికిపోయిన దొంగ. వీడియో పై ఎందుకు మాట్లాడటం లేదు. తప్పుడు పనులు చేస్తున్న నిమ్మగడ్డ తక్షణమే అరెస్టు చేసి విచారణ జరపాలి. నిమ్మగడ్డ బండారం బయట పెట్టేందుకు ఎంత దూరమైన వెళ్తామని అంబటి పేర్కొన్నారు. 

Tags:    

Similar News