సాయితేజ కుటుంబానికి వైసీపీ నేతల పరామర్శ.. 50 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం...

Army Jawan Sai Teja - YCP Leaders: మృతుని భార్యకు ప్రభుత్వోద్యోగం ఇస్తామన్న ద్వారకా నాథ రెడ్డి...

Update: 2021-12-11 10:24 GMT

సాయితేజ కుటుంబానికి వైసీపీనేతల పరామర్శ.. 50 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం...

Army Jawan Sai Teja - YCP Leaders: సాయితేజ కుటుంబ సభ్యులను ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్ధానిక ఎమ్మెల్యే ద్వారక నాధరెడ్డిలు కలిసి పరామర్శించారు. వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 50లక్షల రూపాయలు సాయం చేసారు. అయితే చేసిన సాయాన్ని చెప్పడం అసందర్భమని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు.

ఇలాంటి దుర్ఘటనలలో చనిపోయిన ఎన్ని కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్ని కోట్లిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. మృతుని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వడానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం సాయితేజ త్యాగాలను గుర్తించి అన్ని విధాలా ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందని మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు.

Tags:    

Similar News