Guntur: గుంటూరు జిల్లా గురజాలలో వైసీపీ జోరు

Guntur: 16 వార్డుల్లో వైసీపీ అభ్యర్థుల విజయం * మూడు స్థానాలకు పరిమితమైన టీడీపీ

Update: 2021-11-17 07:54 GMT

గుంటూరు ఎన్నికల్లో వైసీపీ హావ (ఫైల్ ఇమేజ్)

Guntur: గుంటూరు జిల్లా గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ జోరు సాగింది. 16 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ మూడు స్థానాలకే పరిమితమైంది. ఒక్క స్థానంలో జనసేన గెలుపొందింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీలోని 12 వార్డుల్లో వైసీపీ జెండా ఎగురవేసింది. ఐదు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. రెండు స్థానాలతో జనసేన సరిపెట్టుకుంది.

ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో టీడీపీ జెండా రెపరెపలాడింది. 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. 7 స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. 1, 2, 5, 6, 7, 8, 9 వార్డుల్లో వైసీపీ విజయం సాధించగా.. మిగిలిన స్థానాల్లో టీడీపీ జెండా ఎగురవేసింది.

Tags:    

Similar News