విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటుందా..?

Vizag Steel Plant: బిడ్డింగ్‌లో పాల్గొనడంపై ఉత్కంఠ

Update: 2023-04-20 04:00 GMT

విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటుందా..?

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఈవోఐలకు బిడ్డింగ్‌ దాఖలు చేసేందుకు ఇవాళ గడువు ముగియనుంది. తెలంగాణ ప్రభుత్వం బిడ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వరంగ సంస్థలకు మాత్రమే.. అవకాశం ఇవ్వాలని కార్మిక సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటివరకు ఏ ప్రభుత్వ రంగ సంస్థలు బిడ్ దాఖలు చేయలేదు.

ఇక విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. విశాఖలో పర్యటించిన సింగరేణి అధికారుల బృందం.. సీఎం కేసీఆర్‌‌కు ఇప్పటికే నివేదిక అందించారు. అయితే బిడ్డింగ్‌లో పాల్గొంటామని తెలంగాణ ప్రభుత్వం గతంలో తెలిపింది.

Tags:    

Similar News