అత్యాచారానికి గురైన ఒంగోలు బాలికకు 10 లక్షల పరిహారం : హోంమంత్రి సుచరిత

Update: 2019-06-25 15:18 GMT

అత్యాచారానికి గురైన ఒంగోలు బాలికకు 10 లక్షల పరిహారంతో పాటు అన్నిరకాల భద్రతను కల్పిస్తామని హోంమంత్రి సుచరిత తెలిపారు. బాలికల రక్షణపై పాఠశాలల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని చట్టాలకు మరింత పదును పెట్టాలని సుచరిత తెలిపారు. తల్లిదండ్రుల కంటే శ్రేయోభిలాషులెవరూ ఉండరని ఆ విషయాన్ని ముఖ్యంగా బాలికలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో స్వపక్షం వారు ఉన్న విపక్షం వారు ఉన్న శిక్ష తప్పదని హోంమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే ఆరా తీసిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News