ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో మోసాలుకి అడ్డు అదుపు లేకుండా పోతుంది . పోలీసులు ఉన్నా ఎంత చాకచక్యంగా వ్యవహరించిన జరగాల్సిందంతా జరిగిపోతుంది . తాజాగా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు చెప్పుకొని కొందరు కేటుగాళ్ళు భారీ మోసాలకు పాల్పడ్డారు . అలా మోసాలకు దిగిన నలుగురు యువకులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లాకు చెందిన పండరి విష్ణుమూర్తి, గంధవరపు తరుణ్, ఎం.జగదీష్, పి.జయకృష్ణ ఓ ముఠాగా ఏర్పడ్డారు.
ఇలా ఏర్పడిన వీరు వై.ఎస్.జగన్ పీఏ నంబర్ ని స్పూఫింగ్ టెక్నాలజీ ద్వారా తెలుసుకొని కొందరు నేతలకు ఫోన్ చేసి వైసీపీ టిక్కెట్లు ఇస్తామని బేరాలాడారు. ఇంకేముంది లక్షలకు లక్షలు బ్యాంకు ఎకౌంటులోకి వేసుకున్నారు . అసలు తానూ ఎవరికీ ఫోన్ చేయలేదని జగన్ పీఏ చెప్పడంతో అసలు విషయం బయటపడింది . దీనిపైన వైసీపీ నేతలు పోలీసులకి ఫిర్యాదు చేయగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని వారిని పట్టుకొని కోర్టులో హాజరుపరిచారు ..