MP Satyanarayana: సీఎం జగన్ను కలవనున్న విశాఖ ఎంపీ ఎవీవీ సత్యనారాయణ
MP MVV Satyanarayana: ఇందుకోసం వారు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు
MP MVV Satyanarayana: సీఎం జగన్ను కలవనున్న విశాఖ ఎంపీ ఎవీవీ సత్యనారాయణ
MP MVV Satyanarayana: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సీఎం జగన్ను కలవనున్నారు. ఇందుకోసం వారు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. కాసేపట్లో జగన్తో సమావేశంకానున్నారు. అయితే తన ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం తర్వాత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. జగన్తో సమావేశంకానుండటం ఇదే తొలిసారి. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, అతని వ్యాపార భాగస్వామి జీవీల కిడ్నాప్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భూ దందాల లావాదేవీల్లో తేడాలతో కిడ్నాప్ డ్రామా చోటు చేసుకుందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని. అప్పుడే అసలైన నిజాలు బయటకు వస్తాయని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్తో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ జీవీలు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.