గ్యాస్‌ లీక్‌.. 12కు చేరిన మృతుల సంఖ్య

Update: 2020-05-08 05:34 GMT

విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు చేరింది. ఈ మేరకు పోలీసులు గురువారం రాత్రి అధికారికంగా మృతుల వివరాలను ప్రకటించారు. మృతుల్లో ఓ వైద్య విద్యార్థి, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కేజీహెచ్ ఆస్పత్రిలో మూడు వార్డుల్లో 193 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవారిలో 47 మంది చిన్నారులు ఉన్నారు.

అప్పలనర్సమ్మ(45), కుందన శ్రియ(6), ఎ.చంద్రమౌళి(19), సిహెచ్‌.గంగరాజు(48), బి.నారాయణమ్మ(35), ఎన్‌.గ్రీష్మ(9), మేకా కృష్ణమూర్తి(72), పి.వరలక్ష్మి(38), ఎన్‌.నాని(40), పి.శంకర్రావు(40), వి.నూకరాజు(60), గంగాధర చౌదరి మృతి చెందారు. 

Tags:    

Similar News