Ganta Srinivasa Rao: బీజేపీకి గంటా షాక్..

టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు బీజేపీ భారీ షాక్ ఇచ్చారు. గత కొద్దికాలంగా అయన బీజేపీలో చేరనున్నారని వార్తలు

Update: 2020-02-18 03:10 GMT

టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు బీజేపీ భారీ షాక్ ఇచ్చారు. గత కొద్దికాలంగా అయన బీజేపీలో చేరనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే..రాజ్యసభ సభ్యుల మాదిరిగా గంటా కూడా బీజేపీలోకి చేరడం ఖాయమని అప్పట్లో ప్రచారం సాగింది. దీనిపైన అయన పలుమార్లు స్పందిచారు కూడా.. తాజాగా ఈ వార్తలకి మరోసారి చెక్ పెడుతూ... 300 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలకు పసుపు కండువా వేసి బీజేపీ పార్టీకి గట్టి షాకిచ్చారు గంటా...

విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన 300 మంది బీజేపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారని గంటా వెల్లడించారు, టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగిందని, ఇదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా చేరికలు జరిగి పార్టీ మరింత బలపడాలని ఆశిస్తున్నానని గంటా అన్నారు. ఈనెల 19 నుంచి వార్డుల వారీగా 45 రోజుల పాటు ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నామని , భవిష్యత్తులో అన్ని పార్టీల నుంచి టీడీపీ లోకి చేరికలుంటాయని గంటా ప్రకటన చేశారు.. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్స్ చేశారు.

1999లో రాజకీయాల్లో వచ్చిన గంటా తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందాడు. 2004 ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ఆ తర్వాత 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీలో చేరి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రిమండలిలో మంత్రి అయ్యారు. ఇక 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరుపున విశాఖ ఉత్తర నుంచి గెలుపొందారు. 


Tags:    

Similar News