గుండెపోటుతో చనిపోయిన గ్రామ వాలంటీర్ కుటుంబానికి జగన్ సర్కార్ అండగా నిలిచింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పాడేరు మండలం తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేస్తూ వాలంటీర్ గబ్బాడ అనురాధ (26) గుండెపోటుతో మరణించింది. ఈ సంఘటన తెలియగానే సీఎం జగన్ శనివారం అనురాధ కుటుంబానికి రూ. 5లక్షల పరిహారాన్ని ప్రకటించారని తెలిపారు అధికారులు.
వాలంటీర్ మృతిపై సీఎంఓ అధికారులతో సీఎం జగన్ ఫోన్లో మాట్లాడి, ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారన్నారు. కరోనా వంటి విపత్తు సమయంలో పని చేస్తున్న వాలంటీర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అనురాధ కుటుంబానికి ఈ సహాయం వెంటనే అందేలా చూడాలని విశాఖ జిల్లాకలెక్టర్ను ఆదేశించారు.