సదావర్తి సత్రం భూముల వేలంపై విజిలెన్స్ విచారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సదావర్తి భూముల వేలంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తించిన ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.