లోక కల్యాణార్థం విజయవాడలో వరుణయాగం నిర్వహించారు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్, ఆలయ ఈవో కోటేశ్వరమ్మ గణపతి పూజతో యాగాన్ని ప్రారంభించారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, లోక కల్యాణం కోసం వరుణ యాగం నిర్వహిస్తున్నట్టు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. ఈ యాగాలు నేటి నుంచి ఐదురోజులపాటు దుర్గా ఘాట్లో జరుగుతాయని ఈవో చెప్పారు.