దిండి రిసార్ట్స్లో పవన్ కల్యాణ్తో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా భేటీ అయ్యారు. అంతకుముందు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో వంగవీటి రాధా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో జనసేనలో వంగవీటి రాధా చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
జనసేన మేధోమథన సమావేశం తూర్పుగోదావరి జిల్లా రాజోలు దిండి రిసార్ట్స్ లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు వచ్చిన జనసేనానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు స్వాగతం పలికారు. రాజమండ్రి నుంచి దిండి రిసార్ట్స్ కు వస్తుండగా పలుచోట్ల పవన్ కల్యాణ్ ను కలిసేందుకు అభిమానులు ఆయన వాహనాన్ని నిలిపివేశారు. దీంతో దిండి రిసార్ట్స్ కు జనసేనాని రావడం ఆలస్యమైంది. రేపు రాజోలులో పవన్ కల్యాణ్ రోడ్ షో ఉంటుందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు.
.