రెండో సారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ నిరుత్సహకరంగా ఉందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ముఖ్యమైన అంశాలపై అసలు ప్రస్తావనే లేదని విమర్శించారు. ఉద్యోగ కల్పన, రైతుల ప్రయోజనాలపై బడ్జెట్లో క్లారిటీ లేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పబ్లిక్ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ సరికాదని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ నిరాశాజనకంగా ఉందన్నారు.