కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న తరుణంలో బ్రిటన్ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను అన్ని విధాలా ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. గురువారం ఉదయం భారతీయ విద్యార్థుల భయాందోళనలను ట్విటర్ ద్వారా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
పవన్ కల్యాణ్ తో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ఫోన్ లో మాట్లాడారు. యు.కె.లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు అవసరమైన ఆహారం, వసతి సమకూరుస్తామని హామీ ఇచ్చారు. "లండన్ లో ఉన్న హై కమిషన్ కార్యాలయ అధికారులు ఆ విద్యార్థులకు సహాయం అందిస్తారు. ఎవరూ ఆందోళన చెందవద్దు. వారి క్షేమ సమాచారాలను తెలుసుకుంటాం" అని కేంద్ర మంత్రి చెప్పారు.
యు.కె.లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు సహాయం అందిస్తాం#IndiaFightsCorona pic.twitter.com/XwCIpcBLqL
— JanaSena Party (@JanaSenaParty) April 2, 2020