ఆర్టికల్ 370 రద్దు విషయం తప్పేమీ కాదని అయితే దాన్ని ప్రజాస్వామ్య బద్దంగా అమలు చేయాలి కానీ ఆర్మీ, కర్ఫ్యూతో కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. మంగళవారం ఉండవల్లి ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసలు కశ్మీర్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదని.. అక్కడికి ఎవరినీ వెళ్లనీయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నడుచుకుంటుందని విమర్శించారు. గాంధీ, నెహ్రూ వేర్వేరు కాదని మహాత్ముడు చెప్పిందే నెహ్రూ చేశారని ఉండవల్లి చెప్పుకొచ్చారు.