పవన్ ఫైర్‎కు దిగొచ్చిన ట్విట్టర్ !

జనసేన పార్టీ చెందిన కార్యకర్తల ట్విటర్ ఖాతాలను ఆ సంస్థ పునరుద్ధరించింది. దీంతో ట్విటర్ యాజమాన్యానికి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.

Update: 2019-09-20 10:34 GMT

జనసేన పార్టీకి చెందిన కార్యకర్తల ట్విటర్ ఖాతాలను ట్విటర్ సంస్థ పునరుద్ధరించింది. దీంతో ట్విటర్ యాజమాన్యానికి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. రాజ్యాంగ బద్ధమైన భావ స్వేచ్ఛ వ్యక్తీకరణకు నిలబెట్టినందుకు ట్విటర్ ఇండియాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. అయితే  ఇటీవలె జనసేన పార్టీకి చెందిన 400మంది ట్విటర్ ఖాతాలను సస్పెన్షన్ విధించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్, ట్వీటర్ తమ సామాజిక మాధ్యమ ఖాతాలను పునరుద్ధరించాలని, తమ కార్యకర్తల ట్వీటర్ ఖాతాలను ఎందుకు సస్పెన్షన్ విధించారో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందుకు తొలిగించారా అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News