Bobbili Farmers: బెల్లాన్ని కొంటామని టీటీడీ అధికారులు గతంలో హామీ ఇచ్చారు..మంత్రి బొత్స ఈ విషయంపై స్పందించడం లేదు..
Bobbili Farmers: ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం అన్యాయం
Bobbili Farmers: బెల్లాన్ని కొంటామని టీటీడీ అధికారులు గతంలో హామీ ఇచ్చారు..మంత్రి బొత్స ఈ విషయంపై స్పందించడం లేదు..
Bobbili Farmers: చెరకు పంటను గానుగ చేసి బెల్లంగా మార్చిన తర్వాత టీటీడీ అధికారులు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి... ఇప్పుడు కొనుగోలు చేయడం లేదని బొబ్బిలి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్లాన్ని కొనడం లేదని మంత్రి బొత్స వద్ద గోడు వెళ్లబోసుకోగా... తనకేం తెలియదంటూ దాటవేశారని రైతులంటున్నారు. చెరుకును గానుగ చేసి బెల్లంగా మార్చిన తర్వాత కొంటామని టీటీడీ అధికారులు చెప్పారని.. ఇప్పుడు కొనుగోలు చేయకపోతే ఈ బెల్లాన్ని ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరితే సంబంధం లేదని మంత్రి బొత్స చెప్పడం అన్యామంటున్నారు.