టీటీడీలో సరికొత్త రికార్డ్ నమోదైంది. శ్రీవారికి జూన్ నెలలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. గత ఏడాది జూన్లో 91.81 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించగా ఈ ఏడాది 100.37 కోట్లు లభించింది. అదే విధంగా శ్రీవారిని దర్శించుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఏడాది కాలంలో 24.66 లక్షల మంది భక్తులు శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 12.88 లక్షల మంది శ్రీవారికి తలనీలాలు అర్పించుకున్నారు.