TTD Chairman Bhumana: భక్తులకు ఆత్మస్థైర్యం కల్పించేందుకే ఊతకర్రలు పంపిణీ
TTD Chairman Bhumana: కర్రలు ఇచ్చి మా పని అయిపోయిందని అనుకోవడంలేదు
TTD Chairman Bhumana: భక్తులకు ఆత్మస్థైర్యం కల్పించేందుకే ఊతకర్రలు పంపిణీ
TTD Chairman Bhumana: తిరుమలలో కాలినడక భక్తుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామన్నారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలిపిరి నడకమార్గంలో ఊత కర్రల పంపిణీపై కొందరు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. కర్రలు ఇచ్చి తమ పని అయిపోందని అనుకోవడంలేదన్నారు. భక్తులకు ఆత్మస్థైర్యం కల్పించడానికే కర్రలు అందిస్తున్నామన్నారు. ఎవరో చేసిన విమర్శలకు భక్తుల భద్రత విషయంలో వెనుకాడేది లేదన్నారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి.