ఎల్1, ఎల్2 దర్శనాలు రద్దు చేసి నూతన విధానం అమలు చేయడంపై టీటీడీ అధికారులు కసరత్తు పెంచారు. ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలకు, సాధారాణ వీఐపీలకు, వీఐపీ సిఫార్సు లేఖలపై ఏ విధంగా దర్శనం కల్పించాలనే ఆంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ ఆణివార ఆస్థానం సందర్భంగా ప్రోటోకాల్ పరిధిలోని 40 మంది ప్రముఖలకు మాత్రమే బ్రేక్ దర్శనం కేటాయింపు జరిగింది. నూతన బ్రేక్ దర్శన విధానంపై సాంకేతిక మార్పులు జరుగుతున్నాయి.