Andhra Pradesh: ఈనెల 27న తిరుమలలో టీటీడీ బోర్డు సమావేశం

Andhra Pradesh: అన్నమయ్య భవన్‌‌లో ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరుగనున్నాయి

Update: 2021-02-23 05:22 GMT

టీటీడీ బోర్డు మీటింగ్ (ఫైల్ ఇమేజ్ ది హన్స్ ఇండియా)

Andhra Pradesh: టీటీడీ బోర్డు సమావేశం ఈనెల 27న తిరుమలలోని అన్నమయ్య భవన్‌‌లో ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరగనుంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా గత ఏడాది మార్చి నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. తిరిగి జూన్ నుంచి దర్శనాలను మొదలు పెట్టినప్పటికీ ఆర్జిత సేవలు మాత్రం ప్రారంభం కాలేదు. వైరస్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో తిరిగి ఆర్జిత సేవలను ప్రారంభించే అంశంతో పాటు భక్తుల సంఖ్యను పెంచే అవకాశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News