Corona: శ్రీకాకుళం జిల్లా మండలం కొయ్యానపేటలో విషాదం

Corona: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం కొయ్యానపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది.

Update: 2021-05-03 05:06 GMT

Representational Image

Corona: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం కొయ్యానపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. విజయవాడలో కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్న అసిరినాయుడికి కరోనా సోకింది. దీంతో కుటుంబంతో సహా సొంత గ్రామానికి వచ్చారు. అయితే వారిని గ్రామంలోకి అనుమతించకపోవడంతో పశువుల శాలలో ఉంటున్నారు. అసిరినాయుడి పరిస్థితి విషమించడంతో ఎవరూ దగ్గరకు వెళ్ళలేక పోయారు. నేలపై కొట్టుమిట్టాడుతున్న తండ్రిని చూసి కూతురు దగ్గరకు వెళ్లి నీరు అందించేసరికి తండ్రి తుదిశ్వాస విడిచాడు. 

Tags:    

Similar News