కొన్ని నెలలుగా చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు స్తంభించిన నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు ఇవాళ ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారు జగన్తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు నాగార్జున, సురేష్ బాబు, త్రివిక్రమ్, రాజమౌళి, సి.కళ్యాణ్, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారంపై ఈ సందర్భంగా సీఎంతో వారు చర్చించారు. రాష్ట్రంలో ఉచితంగా సినిమా చిత్రీకరణలకు అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.