Tirupati By Poll: ప్రశాంతంగా కొనసాగుతోన్న తిరుపతి ఉపఎన్నిక పోలింగ్

Tirupati By Poll: పలు చోట్ల మొరాయించిన ఈవీఎంలు * సాంకేతిక సమస్యలను సరిచేయడంతో తిరిగి పోలింగ్ ప్రారంభం

Update: 2021-04-17 05:44 GMT

కొనసాగుతున్న తిరుపతి ఉప ఎన్నికలు (ఫైల్ ఇమేజ్)

Tirupati By Poll: తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు చోట్ల ఈవీఎంలు కాస్త మొరాయించాయి. సాంకేతిక సమస్యలను సరిచేయడంతో తిరిగి పోలింగ్‌ ప్రారంభమైంది. జిల్లాలోనే అత్యధిక ఓట్లు ఉన్న సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. వెంకటాచలం కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సహాయ ఎన్నికల అధికారి దినేష్ కుమార్ పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్‌ సాఫిగా సాగుతుందని చెబుతున్న ఏఆర్వో దినేష్‌కుమార్‌.

Tags:    

Similar News