మే 17 వరకు శ్రీవారి దర్శనం బంద్

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మే 17 వరకు శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ స్పష్టం చేశారు.

Update: 2020-05-02 17:20 GMT
Tirumala (File Photo)

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మే 17 వరకు శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ స్పష్టం చేశారు. స్వామి వారికీ నిత్యం పూజలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు వచ్చేవరకు శ్రీవారి దర్శనం కలిపించడం పై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

ఇక లాక్ డౌన్ తర్వాత తిరుమలలో సోషల్ డిస్టెన్స్ అమలు చేస్తూ దర్శనం కలిపించడంపై ఇప్పటినుంచే కార్యాచరణను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం నుంచి బర్డ్ లో ఓపీ సేవలను ప్రారంభిస్తున్నామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు.



Tags:    

Similar News