కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ టైగర్

Kakinada: రౌతులపూడి మండలం లచ్చిరెడ్డివారిపాలెంలో పెద్దపులి సంచారం

Update: 2022-06-28 04:36 GMT

కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ టైగర్

Kakinada: కాకినాడ జిల్లాలో గత కొద్ది రోజులుగా అటవీ అధికారులను, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న పెద్దపులి తాజాగా రౌతులపూడి మండలంలోకి అడుగుపెట్టింది. లచ్చిరెడ్డి పలెంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఓ కుంట దగ్గర నీరు తాగేందుకు పెద్దపులి వచ్చినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కుమ్మరి లోవ అటవీ ప్రాంతంలో సంచరిస్తోంది. దాంతో స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులకు అప్రమత్తంగా ఉండాలంటూ అటవీ అధికారులు సూచించారు.

Tags:    

Similar News