కర్నూలు జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో పులి కలకలం రేపింది. శ్రీశైలం దేవస్థానానికి 11 కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో చిన్నారుట్ల వద్ద పులి సంచరిస్తున్నట్టు గుర్తించారు. కొంతసేపు రోడ్డుకు అడ్డంగా పులి నిలబడింది. దీంతో శ్రీశైలం వెళ్తున్న భక్తులు భయాందోళనకు గురైయారు.
సుమారు 20 నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో భక్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.