Narayana Swamy: జగన్ రాష్ట్రానికే కాదు.. దేశానికే ఆదర్శం
Narayana Swamy: రానున్న ఎన్నికల్లో జగన్ను మరోసారి సీఎం చేయాలి
Narayana Swamy: జగన్ రాష్ట్రానికే కాదు.. దేశానికే ఆదర్శం
Narayana Swamy: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పేదవాడి సొంతింటి కల నెరవేర్చారని, సీఎం అయిన తర్వాత ఒక్క రూపాయికే టిడ్కో ఇళ్లను నిర్మించి పేదవాడి మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడని పొగిడారు.. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ, జగనన్న కాలనీలో... టిడ్కో గృహ సముదాయాన్ని డిఫ్యూటీ సీఎం నారాయణ స్వామి ప్రారంభించారు.
అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల తాళాలను అందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడారు.. ఇలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికే కాదు.. దేశానికే ఆదర్శమని డిఫ్యూటీ సీఎం నారాయణ స్వామి కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంను చేయాలని పిలుపునిచ్చారు.