ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ల అదృశ్యానికి కారణమేంటి?

Update: 2020-02-18 10:49 GMT
ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ల అదృశ్యానికి కారణమేంటి?

వాళ్లు ముగ్గురూ అక్కా చెల్లెళ్లు. విశాఖ పట్నం ద్వారకా నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ కూతుళ్లు. ఏమైందో ఏమోగానీ హటాత్తుగా వారు మాయమయ్యారు. తాము ఇల్లు వదిలి వెళ్లిపోతున్నామని తమను వెతకవద్దని తల్లి దండ్రులకు మెసేజ్ చేశారు. పిల్లలు ఇల్లు వదిలి వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోంది వారు ఇంట్లో గొడవ పడి వెళ్లారా? లేక ఎవరైనా వారిని మభ్య పెట్టి తీసుకెళ్లారా? అన్నది తెలియడం లేదు.

విశాఖపట్నం ద్వారకానగర్ లోని ఓ అపార్ట్ మెంట్ వాచ్ మెన్ ఇంట్లో ఈ సంఘటన జరిగింది. పెళ్లీడుకొచ్చిన ముగ్గురు పిల్లలు హటాత్తుగా మాయవడం అటు తల్లి దండ్రులను కలవరపెడుతోంది. ఇంటినుంచి మాయమైన పిల్లలు ముగ్గురూ తాము చెన్నైలో ఉన్నట్లు తల్లి దండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. అయితే వారు చెన్నై ఎందుకు వెళ్లినట్లు? ఈప్రశ్నలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అదృశ్యమైన ఆడపిల్లల తల్లి దండ్రులతో పోలీసులు మాట్లాడుతున్నారు.

Tags:    

Similar News