ఒకరికోసం ఒకరెళ్లి.. అందరూ బలి

కృష్ణాజిల్లా కంచికర్లలో విషాదం జరిగింది. చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. పేరుకలపాడు గ్రామంలో నానమ్మ దగ్గర నివశిస్తున్న చిన్నారులు సరదాగా చెరువులోకి దిగారు.

Update: 2019-08-27 10:52 GMT

కృష్ణాజిల్లా కంచికర్లలో విషాదం జరిగింది. చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. పేరుకలపాడు గ్రామంలో నానమ్మ దగ్గర నివశిస్తున్న చిన్నారులు సరదాగా చెరువులోకి దిగారు. ఈ క్రమంలో ఒకరు నీటిలో మునిగిపోతుండగా ఒకరిని కాపాడే క్రమంలో మరొకరు ప్రయత్నిస్తూ ఇలా ముగ్గురు అన్నదమ్ములు మరణించారు.

చిన్నారుల మృతితో పేరుకలపాడు గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్నారుల తల్లిదండ్రులు జీవనభృతి కోసం సుదూర ప్రాంతానికి వలస వెళ్లారు. దీంతో ముగ్గురు అన్నదమ్ములు నానమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్నారు. చిన్నారులు చెరువులు పడడంతో సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే జగన్మోహనరావు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. వృత్తిరీత్యా వైద్యులు కావడంతో ఎమ్మెల్యే ప్రథమ చికిత్స అందించారు. కానీ అప్పటికే చిన్నారులు మృతి చెందడంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Tags:    

Similar News