శ్రీశైల క్షేత్రానికి కార్తీకమాసంలో రికార్డు స్థాయిలో రాబడి

* 30 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం... గతం కంటే ఈ సంవత్సరం 55.51 శాతం పెరిగిన ఆదాయం

Update: 2022-11-26 06:03 GMT

శ్రీశైల క్షేత్రానికి కార్తీకమాసంలో రికార్డు స్థాయిలో రాబడి

Srisailam: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మ వారి దేవస్థానానికి కార్తీకమాసం నెలలో భారీగా రాబడి లభించింది ఆలయ హుండీలు ఆర్జిత, ప్రత్యక్ష, పరోక్ష సేవల ద్వారా 30 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చిందని దేవస్థానం ఈఓ లవన్న తెలిపారు నిరుడు కార్తీకమాసంలో 19 కోట్ల 95 లక్షల రూపాయల ఆదాయం మాత్రమే ఆదాయం వచ్చిందన్నారాయన నిరుటితో పోలిస్తే ఈ సంవత్సరం 55.51 శాతం ఆదాయం పెరిగిందని వెల్లడించారు శ్రీశైల మహాక్షేత్రంలో గత నెల అక్టోబర్ 26 నుంచి నవంబర్ 23 వరకు ఘనంగా కార్తీక మసోత్సవాలు నిర్వహించామన్నారు. 

Full View
Tags:    

Similar News