Andhra Pradesh: అనంతపురం జిల్లా బత్తలపల్లిలో వరుస చోరీలు

Andhra Pradesh: భయాందోళనకు గురవుతున్నవ్యాపారస్తులు

Update: 2021-02-21 05:49 GMT

Representational Image

Andhra Pradesh: అనంతపురం జిల్లా బత్తలపల్లిలో వరుస చోరీలతో వ్యాపారస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పది రోజుల వ్యవధిలోనే చోరీలు జరుగుతుండడంపై ఆందోళన చెందుతున్నారు. గోడకు కన్నం వేసి ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు దొంగలు. ఇప్పటికే పలు దుకాణాల్లో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడిన దుండగులు ఓ దుకాణానికి కన్నం వేసి చోరీ చేసేందుకు విఫలయత్నం చేశారు. వరుస చోరీలతో వ్యాపారస్తులకు భయం పట్టుకుంది. పలు మార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన చోరీలు ఆగడం లేదని ఆవేదన చెందుతున్నారు.

Tags:    

Similar News