విశాఖ జిల్లా పినగాడిలో రణరంగం.. ల్యాండ్ పూలింగ్పై ఎదురు తిరిగిన గ్రామస్తులు !
విశాఖ జిల్లా పెందుర్తి మండలం పినగాడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ల్యాండ్ పూలింగ్పై గ్రామస్తులు ఎదురు తిరిగారు. పినగాడిలో 32 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు.
భూములు ఖాళీ చేస్తే తాము రోడ్డున పడతామంటూ గొడవకు దిగారు. దీంతో రెవెన్యూ అధికారులు పోలీసులను రంగంలోకి దించడంతో బలవంతంగా గుడిసెలను నేలమట్టం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన గ్రామస్తులను అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల అదుపులో ఉన్న గ్రామస్తులకు టీడీపీ సంఘీభావం ప్రకటించింది. బాధితులను టీడీపీ నేతలు పరామర్శించారు.