పేదోడికి అందకుండా పోతున్న పేదోడి ఫ్రిజ్‎

కొనేవాళ్లు లేరు.. ధరలు పెరిగిపోయాయి

Update: 2022-05-07 15:00 GMT

పేదోడికి అందకుండా పోతున్న పేదోడి ఫ్రిజ్

Guntur: మండుటెండలో దాహార్తి తీరాలంటే ఫ్రిజ్ వాటర్ కన్నా కుండనీళ్లే మంచిదని అందరికీ తెలిసిందే. అయితే పేదవాడి ఫ్రిజ్‎గా పేరున్న కుండలు కాలక్రమేణా కనుమరుగైపోతున్నాయి. దీంతో గుంటూరు జిల్లాలో కుండలు తయారు చేసే శాలివాహనుల జీవితాలు అగమ్యగోచరంగా తయారవుతున్నాయి. ఎందుకంటే కూలింగ్ క్యాన్లు, ఫ్రిజ్ లు విరివిగా రావడంతో మట్టి కుండలు కొనేవారే కరువైపోయారు. దీంతో కుండలు తయారుచేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ప్రభుత్వం చేనేత కార్మికులకు మాదిరిగానే తమకు కూడా పింఛను ఇచ్చి ఆదుకోవాలని శాలివాహన వృత్తిదారులు కోరుతున్నారు.

Tags:    

Similar News