Kakani: ప్రజా సేవలో గుర్తింపు ప్రధానమన్న మంత్రి

Kakani: సీఈఓలు చిత్తశుద్ధితో పని చేసి బ్యాంకుల..

Update: 2023-08-25 12:17 GMT

Kakani: ప్రజా సేవలో గుర్తింపు ప్రధానమన్న మంత్రి

Kakani: ప్రజాస్వామ్యంలో పదవుల కన్నా... ప్రజా సేవలో గుర్తింపు ప్రధానమని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు కేంద్ర సహకార బ్యాంకులో 13 జిల్లాల డీసీసీ బ్యాంకుల సీఈఓల కాన్ఫరెన్స్ ను ప్రారంభించిన ఆయన... డీసీసీ బ్యాంకుల సీఈఓలు చిత్తశుద్ధితో పని చేసి సహకార బ్యాంకుల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ బ్యాంకులకు ప్రభుత్వ సహకారం ఎల్లవేళలా ఉంటుందని చెప్పారు. సహకార బ్యాంకులు సరికొత్త టెక్నాలజీ, నూతన ఆలోచన విధానాలతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News