తిరుపతి రుయా ఆసుపత్రిలో దారుణం జరిగింది. వైద్యం కోసం వచ్చిన వ్యక్తిని తరలించేందుకు స్ట్రెచర్ లేకపోవడంతో ... రోగి మృతి చెందాడు. బాబు అనే వ్యక్తి జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. పరిస్ధితి విషమించడంతో .. ఐసీయూ తరలించాలంటూ వైద్యులు సూచించారు. అయితే రోగిని తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ కోసం అరగంట పాటు బంధువులు ఆసుపత్రి అంతా తిరిగారు. అయినా స్ట్రెచర్ లభించకపోవడంతో .... బాబు మృతి చెందాడు. కలెక్టర్ తనిఖీ చేసి వెళ్లిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. స్ధానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.