Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో కేంద్రం మరో కీలక ముందడుగు

Vizag Steel Plant: ఉక్కు కర్మాగారం ఆస్తుల మదింపుని జీఏఏ అసోసియేట్స్ కి అప్పగించిన కేంద్రం

Update: 2022-05-13 02:00 GMT

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో కేంద్రం మరో కీలక ముందడుగు

Vizag Steel Plant: విశాఖ ఉక్కు పరిశ్రమకు స్టీల్ ప్లాంట్ ఫర్ సేల్ బోర్డు తగిలించడానికి కేంద్రం ఎప్పటి నుంచో ట్రై చేస్తోంది. కానీ కార్మికులు, రాజకీయ పార్టీల నుంచి గట్టి వ్యతిరేక గానాలు వినిపిస్తున్నాయి. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో కేంద్రం మరో కీలక ముందడుగు వేసింది. ఉక్కు కర్మాగారం ఆస్తుల మదింపుని జీఏఏ అసోసియేట్స్ కి అప్పగించింది కేంద్రం.

ఆస్తుల మదింపు కోసం ఇటీవల ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది. కేంద్రం లిస్ట్ చేశాక ఒకరైన GAA సంస్థకు ఖరారు చేయనున్నారు. స్టీల్ ప్లాంట్ 100శాతం వ్యూహాత్మక అమ్మకానికి గత ఏడాది కేంద్రం ప్రకటన చేసింది. ఇక అప్పటి నుంచి ఉక్కు పరిరక్షణ ఆధ్వర్యంలో పోరాటాలు, ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. 

Tags:    

Similar News